గాంధీ మహాత్మునికి రాజంపేట జనసేన ఘన నివాళులు

రాజంపేట: అన్నమయ్య జిల్లా, (ఉమ్మడికడపజిల్లా) టి. సుండుపల్లి నాలుగు రోడ్ల కూడలి సర్కిల్ నందు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి రాజంపేట అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూలమాల పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ తెలుగుదేశం వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఎం దామోదర్ నాయుడు, గ్రామ అధ్యక్షుడు చెన్నం శెట్టి వెంకటరమణ సుబ్బరామ, మాజీ ఎంపీటీసీ నంద్యాల రామయ్య, సీనియర్ నాయకులు ఆనంద్ రెడ్డి, బలిజ సంఘం నాయకులు గుగ్గిల కృష్ణయ్య, దళిత నాయకులు వీర నాగయ్య, ఈశ్వర్, మహదేవ డీలర్ రాజా, బూత్ కన్వీనర్ గురవయ్య, పెద్దబ్బ, జనసేన, తెలుగుదేశం పార్టీల శ్రేణులు, కార్యకర్తలు, జనసైనికులు, నాగేష్, లోకేష్, రాజా, చెన్నకేశవులు, రవీంద్ర, పెద్ద ఎత్తున స్థానికులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.