తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన రాజేశ్వరరావు బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన నాయకులు, జనసైనికులతో తుఫాను ప్రభావిత లోతట్టు ప్రాంతాలను రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం వల్ల లోతట్టు ప్రాంతాలలోని చాలా ఇల్లు నీట మునిగాయి. ముంపుకు గురైన ప్రాంతంలో ప్రజలు త్రాగునీటికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే ఫోనులో అధికారులతో మాట్లాడి త్రాగునీటిని అదించాలని చెప్పారు. అదేవిధంగా పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అదేవిధంగా నీతి నిజాయితీకి మారు పేరు అయిన పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని ఏ పేద వారికి కష్టం వచ్చినా చూసి తట్టుకోలేని మంచి మనస్తత్వం ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్, వారి ఆదేశాల అనుగుణంగా తుఫాన్ తగ్గక తరువాత జనసేన నాయకులు, జనసైనికులు వారి దగ్గరికి వెళ్లి కష్టసుఖాలు తెలుసుకుని బాధితులకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడిది సరోజ, జనసేన నాయకులు మేడిది మోహన్, ఏసు, వీర వెంకట్, చవ్వాకుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.