శిధిలావస్థలో రాజీవ్ గృహకల్ప – కళ్ళు మూసుకున్న అధికార పార్టీ

తాడేపల్లిగూడెం, అనేక సమస్యలతో రాజీవ్ గృహకల్ప నివాసితులు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బోలిశెట్టి శ్రీను అన్నారు. జనసేన పల్లెపోరులో భాగంగా మంగళవారం స్థానిక రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ లో ఉన్న ప్రజలను కలిశారు. ఆయన మాట్లాడుతూ త్రాగునీటి కోసం, మురుగు నీరు పారుదల లేక, రోడ్ల నిర్మాణాల లేక ఇబ్బందులు పడుతున్న అపార్ట్మెంట్ వాసులకు తాను తోడువుంటానన్నారు. అధికార ప్రభుత్వం అంధకారంలో ఉన్న కాలని వాసులని చిన్న చూపు చూస్తోందన్నారు. ఎప్పుడు కూలిపోతాయో తెలియని స్థితిలో ఉన్న అపార్ట్మెంట్లో బిక్కుబిక్కున కాలం గడపడం బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి గూడెం మండల అద్యక్షులు అడపా ప్రసాద్, స్థానిక నాయకులు కేశవబట్ల విజయ, పసుపులేటి సత్తిబాబు, పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, అధికారిక ప్రతినిధి సజ్జాసుబ్బు, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ, జిల్లా నాయకులు కసిరెడ్డి మధులత, రామ్ శెట్టి సురేష్, యాంట్రపాటి రాజు, మద్దాల మణికంఠ, గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, జనసేన నాయకులు, మదాసు ఇందు, రౌతు సోమరాజు, అడబాల మురళి, చాపల రమేష్, మారిశెట్టి పోతురాజు, నీలపాల దినేష్, మట్ట రామకృష్ణ, లింగం శ్రీను, యువర్న సోము, సోమాలమ్మ, పసుపులేటి లక్ష్మి, తోట ధనలక్ష్మి, గువ్వ వెంకటలక్ష్మి, గొట్టుముక్కల రమాదేవి జనసేనసోషల్ మీడియా ఇంచార్జ్ బయనపాలేపు ముఖేష్ మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.