అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ దీక్షకు మద్దతు తెలిపిన రాజోలు జనసేన

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు సిపిడిఓ ఆఫీస్ ప్రాంగణంలో రాజోలు తాలూకా అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ వారు చేస్తున్న అంగన్వాడీల నిరాహార దీక్షలో జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్వరరావు బొంతు మాట్లాడుతూ అంగన్వాడి వారు చేస్తున్న సేవలు వల్ల రాష్ట్రంలో కాదు భారతదేశంలో శిశు మరణాల రేటు 20 సంవత్సరాల క్రితం 1000 కి 86 మంది చనిపోతూ ఉండేవారు. కానీ అది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 1000కి 34 మంది చనిపోతున్నారు. ఇంత తగ్గుదలకి కారణం కేవలం అంగన్వాడి వర్కర్స్ అంగన్వాడి టీచర్లు. మీరు ముఖ్యంగా భావితరాన్ని అంటే పిల్లలను తీర్చిదిద్దడానికి ఫిజికల్ గా సైకలాజికల్ గా అన్ని రంగాల్లో మీరు చేస్తున్న సేవ వర్ణణాతీతం. కానీ మిమ్మల్ని జగన్ రెడ్డి ప్రభుత్వం ఇంత బాధ పడుతుందంటే తప్పనిసరిగా అందరు ఆలోచించాలి. మీరు చెప్పిన సమస్యలు అన్నీ కూడా ఈ రాష్ట్రంలో మంచి మనసున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్, సుదీర్ఘ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా వారి ముందుకి తీసుకుని వెళ్తాము. వచ్చే ప్రభుత్వంలో మీకు మంచి జరిగినట్లు చేస్తాము. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం మిమ్మల్ని ఎలా పట్టించుకోవాలో తెలియదు భావితరాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియదు, మిమ్మల్ని కాదు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని ఇదే విధంగా బాధపడుతున్నాడు. ప్రజలను ఏడిపించి జగన్ సంతోష పడతాడు. మీరు చేస్తున్న ఈ దీక్ష కార్యక్రమానికి నూటికి నూరు శాతం జనసేన పార్టీ మద్దతు ఉంటుంది. తప్పనిసరిగా మీతో చివరి వరకు నడుస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన-టిడిపి సమన్వయబాద్యులు గుండుబోగుల పెద్దకాపు, ఎంపిపి మేడిచర్ల సత్యవాణి రాము, రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ గారు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, వీర మహిళలు, గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు పాల్గొనడం జరిగింది.