గిరిజన సంఘ దీక్షకు మద్దతు తెలిపిన రాజు కళ్యాణ్

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు ఐటీడీఏ పీవోను తక్షణమే సస్పెండ్ చేయాలని కోరుతూ గిరిజన సంగం నాయకులు గత కొన్ని రోజులుగా దీక్ష చేస్తున్నారు. దీనికి కారణం పాడేరు ఐటిడిఏ పీవో మొండివైఖరితో గిరిజన విద్యార్థులు వరుసగా మరణిస్తున్నప్పటికీ పి.ఓ కనీస స్పందన లేదు, అలాగే గిరిజన విద్యాసంస్థల్లో ప్రవేశం నిరాకరిస్తూ గిరిజన సంక్షేమ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన సర్కులర్ రద్దు చేయాలని గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి గానీ, ఐటీడీఏ నుంచి గానీ ఎటువంటి స్పందన లేదు. గిరిజన సంఘం చేస్తున్న దీక్షకు గురువారం జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెదబయలు మండల నాయకులు జాగ్రత్త కళ్యాణ్ మరియు హుకుంపేట మండల నాయకులు సిహెచ్ రాజ్ మద్దతు తెలపడం జరిగింది.