ఆకునూరి ఆంజనేయులుకు మనోధైర్యాన్నిచ్చిన రామ్ సుధీర్

పెడన, జనసేన ఆవిర్భావ సభకు వెళ్తుండగా ప్రమాదవశాత్తూ గాయపడిన గూడూరు మండలం, గూడూరు గ్రామం జనసైనికుడు ఆకునూరి ఆంజనేయులును పరామర్శించి వైద్యం కోసం 5,000/- రూపాయల ఆర్ధికసాయం అందజేసిన పెడన నియోజకవర్గం జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్. ఎలాంటి సహాయం కావాలన్నా పార్టీ తరపున అండగా ఉంటామని ఆంజనేయులుకు రామ్ సుధీర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలగని లక్ష్మీ నారాయణ, గోట్రు రవి కిరణ్, దివి శ్రీనివాస్, సయ్యద్ షఫీ, అశోక్ కుమార్, అనిల్, మహేష్, నవీన్, నాగ ఆంజనేయులు, బాదం వినోద్, అఖిల్, అంజిబాబు, గుడిసే సాయి ప్రసాద్, బొర్రా శ్రీకాంత్, పోతన గంగాధర్, శివ స్వామి, లోయ సాయి, నాగార్జున, మద్దాల పవన్ మరియు స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.