అవినీతి వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపండి.. కూటమి అభ్యర్థి బొలిశెట్టి పిలుపు

తాడేపల్లిగూడెం: సంక్షేమ ముసుగులో ఎస్సీ బీసీ కార్పొరేషన్ల రుణాలను దారి మళ్లించి అవినీతి సామ్రాజ్యాన్ని నెలకొల్పుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని తాడేపల్లిగూడెం అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం భాగంగా తాడేపల్లిగూడెం లోని 13వ వార్డు శివాలయం రోడ్ లో బుధవారం ఉదయం ఆయన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. నా ఎస్సీలు నా బీసీలు అంటూనే దళితులను చంపి ఇంటికి పార్సిల్ గా చేసిన వారిని కూడా పెట్టుకు తిరుగుతున్న నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని మరోసారి ఆయన మాయమాటలు నమ్మడానికి ఎస్సీలు బీసీలు సిద్ధంగా లేరని బొలిశెట్టి అన్నారు. మున్సిపాలిటీలో కనీస అవసరాలు అయినా త్రాగునీరు కూడా అందించలేని స్థితిలో పాలన కొనసాగుతుందని ఐదేళ్ల పాలనలో కనీసం రోడ్లపై గుంతలు కూడా పోర్చలేని స్థితిలో ఇక్కడి పరిపాలన కొనసాగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వలవల బాబ్జి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలను దూరం చేసిన ఘనత చిన్న నిర్మాణాలకు సైతం కేటాక్స్ పేరుతో వసూళ్లకు పాల్పడ్డ వైసిపి అభ్యర్థి కొట్టి సత్యనారాయణ ను ప్రజలు ఇంటికి పంపే సమయం ఆసన్నమైందన్నారు. శివాలయం వీధిలో సమస్యలను స్థానికులు కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కు వివరించగా కూటమి ప్రభుత్వం రాగానే ప్రతి సమస్యను పరిష్కరించి తాడేపల్లిగూడెంను అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. కార్యక్రమంలో ఈత కోట తాతాజీ తదితరులు పాల్గొన్నారు.