శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, కేంద్రం రాయచోటి పట్టణ పరిధిలో గాలివీడుకు వెళ్ళే రోడ్డు పక్కన లక్ష్మీపురం నగర్ లో మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు వారి సొంత నిధులతో నూతన ఆలయాన్ని నిర్మించి ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా రాజంపేట అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని సందర్శించి మిత్రులతో కలిసి స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ పెద్దాయన పాలకొండరాయుడు కృషి వల్ల చాలా ఆలయాలు నిర్మించి అందుబాటులోకి తీసుకురవడం పట్ల పాలకొండ్రాయుడుకి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం నిర్మాణం పూర్తి అయిన శుభసందర్బంగా భక్తులు మరియు ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.