ఎస్.బి.ఐ ఖాతాదారుల సేవా కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండల కేంద్రంలో పింఛ రోడ్డు మీద పాత స్టేట్ బ్యాంక్ ఎదురుగా
నూతనంగా ఏర్పాటుచేసిన ఎస్.బి.ఐ ఖాతాదారుల సేవాకేంద్రానికి టి.ఎస్ వెంకటేశ్వర్లు మొదటి కుమారుడు భారత్ కుమార్ ఆహ్వానం మేరకు హాజరైన జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఖాతాదారులకు అన్ని రకాల బ్యాంక్ సేవలు అందుబాటులో కలవు, కావున అన్ని ప్రాంతాల ప్రజలందరూ ఈ యొక్క సదవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ లీడర్ గంతల చెన్నకృష్ణ, సీనియర్ లీడర్ ఆనంద్ రెడ్డి, చలపతి, శివరామ్, సునీల్, వినోద్ కుమార్, ప్రసాద్, నజిమ్, బంధుమిత్రులు, స్థానికులు, వివిధ ప్రాంతాల నుంచి మండల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.