అన్నమయ్య డిపో మేనేజర్ దనుంజయకు వినతిపత్రం అందజేసిన రామ శ్రీనివాస్

  • రాయచోటి తిమ్మసముద్రం మీదుగా పింఛా మరియు రాయచోటి, సుండుపల్లి వయా సానిపాయి, మరియు తిమ్మసముద్రం మీదుగా పాపన్నగారిపల్లి బస్సులను పునరుద్ధరణ చెయ్యాలి.

అన్నమయ్య జిల్లా, సుండుపల్లి మండలం, రాయచోటి నుంచి తిమ్మసముద్రం మీదుగా పింఛా బస్సులు పునరుద్ధరించాలని.. తుపాను కారణంగా చిట్టేడు వంకమీద గల బ్రిడ్జి కొట్టకపోవడంతో బస్సును నిలిపి వేయడం జరిగింది. బ్రిడ్జి పునరుద్ధరించి తిమ్మసముద్రం నుంచి బెస్తపల్లి వరకు పదకొండు పల్లెల నివాసులకు బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రిపూట ఆరోగ్య సమస్య తలపెట్టిన కూడా ఎలాంటి సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్నారు కనుక సమస్యలను గుర్తించి పునరుద్ధరన చేసి బస్సుల సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యుడు షేక్ రియాజ్, శ్రీనివాస రాజు, మదన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.