మత సామరస్యానికి ప్రతీక రంజాన్

*జనసేన పార్టీ నాయకులు గాదె పృథ్వి

త్యాగానికి ప్రతిరూపం, మత సమరస్యానికి ప్రతీక రంజాన్ పర్వదినమని జనసేన పార్టీ నాయకులు గాదె పృథ్వి అన్నారు. రంజాన్ సందర్బంగా డివిజన్ కేంద్రంలోని దర్గాలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. భారతీయ హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటామని పేర్కొన్నారు. దేశ సమగ్రతకై ఒకరినొకరు గౌరవించుకోవాలని తెలిపారు. విద్యార్థి విభాగం నాయకులు మహమ్మద్ రజాక్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఖీర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రజాక్, మునిగల పవన్, మేడిద ప్రశాంత్, మహమ్మద్ బషీర్, రాకేష్, యాకయ్య, రాజేష్, విజయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.