నిరుపేద కుటుంబానికి రంజాన్ తోఫా

ప్రకాశం జిల్లా, కంభం గ్రామం కోనేటి వీధిలో షేక్ కరిమున్ భర్తను కోల్పోవడం కుమారుడు వికలాంగుడు కావడం, కుమార్తె పిట్స్ తో అనారోగ్యంతో ఉండడం, ముగ్గురు కుమార్తెలు ఉండడం గురించి తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ ఇంచార్జి బెల్లంకొండ సాయిబాబు అదేశాల మేరకు రంజాన్ తోఫా క్రింద 25 కేజీల బియ్యం మరియు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు, జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య, కంభం మండల అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్, షేక్ హాజ్మతుల్ల, షేక్ శుభాని తదితరులు పాల్గొన్నారు.