జనసేనాని ఆదర్శంగా 4వ మసీదు అభివృద్ధికి రామదాసుచౌదరి విరాళం

మదనపల్లె నియోజకవర్గం, నిమ్మనపల్లె మండలం, నిమ్మనపల్లె కసభ తవళం క్రాస్ లో ఉన్న అబ్బుహనీఫ మసీదుకి ముత్తవల్లి అయిన మోహిన్పీర్ ఖాసింఖాన్ ధన్యసాబ్ షాబాజ్ ఖాన్ ‘ఆఫ్రోజ్’ వీరికి జనసేన పార్టీ రాయలసీమ కో- కన్వీనర్ గంగారపు రామదాసుచౌదరి రూపాయలు 10,000/-, మసీదు అభివృద్ధికి ఇవ్వడము జరిగినది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, మదనపల్లె రూరల్ అధ్యక్షుడు గ్రానైట్ బాబు, నిమ్మనపల్లె మండల అధ్యక్షుడు ప్రదీప్ సింగ్, యువ మైనార్టీ నాయకుడు ఆఫ్రోజ్, ఐటీ విభాగం జగదీష్’ లక్ష్మినారాయణ మరియు కుమార్ తదితరులు జనసేన పార్టీ తరపున పాల్గొన్నారు.