కుందనపల్లి గ్రామస్థులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన రామగుండం జనసేన

ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గం మండలం కుందనపల్లి గ్రామంలో ఉన్న ఎన్టిపిసి యాష్ పాండ్ వల్ల కుందనపల్లి గ్రామస్తులు తీవ్ర అనారోగ్య సమస్యలు ఏదురుకుంటున్నారు. 40 నుండి 45 వయసు వారు కిడ్నీ, గుండె జబ్బులతో 60 కు పైచిలుకు మరణించగా గ్రామంలో తీవ్ర శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారని గ్రామస్తులు తమ గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అదే గ్రామంకు చెందిన జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన సెక్రటరీ గోపికృష్ణ, జనసైనికుడు పృధ్వీ ద్వారా సమాచారం తెలుసుకున్న జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన అధ్యక్షుడు రావుల మధు, పెద్దపల్లి పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యులు రావుల సాయికృష్ణ, జనసేన నాయకులు రంజిత్, రాజశేఖర్ కుందనపల్లి గ్రామస్తులను కలిసి వారి సమస్యకు పరిష్కారం వచ్చే వరకు వారికి అండగా ఉంటామని, ఎన్టిపిసి యాజమాన్యం వెంటనే కుందనపల్లి గ్రామస్తులకు పునరావాసం కల్పించాలని దీనికి ప్రభుత్వ అధికారులు సహకరించాలని డిమాండ్ చేశారు.