నియోజకవర్గ ప్రజలకు కష్టాల్లో అండగా నిలబడే బండారు శ్రీనివాస్

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, రావులపాలెం మండలంలోని, పొడగట్లపల్లి జిత్తుగపాడు గ్రామమునకు చెందిన వారు పులగం వెంకన్న, కుచ్చె వీరబాబు, సిరిమేళ్ల రాముడు ఇటీవలి కాలంలో కొద్ది రోజుల క్రితం స్వర్గస్తులైన కారణంగా, వారి కుటుంబాలను, శనివారం కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ఎంతో ధైర్యం చెప్పారు. కుటుంబంలోని వ్యక్తులు లేని లోటు ఎంతో పూడ్చలేనిదని, ఎవరు కూడా ఎలాంటి బెంగ పెట్టుకోకుండా, బాధలను అన్ని మరచి ముందుకు సాగాలని, స్వర్గస్తులైన వారి కుటుంబ సభ్యులకు, బండారు శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బండారు శ్రీనివాస్ వెంట పలువురు మండలస్థాయి, గ్రామస్థాయి జనసేన నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.