ఘనంగా డా.రాపాక రమేష్ బాబు జన్మదిన వేడుకలు

రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డా.రాపాక రమేష్ బాబు జన్మదిన సందర్భంగా బుధవారం జనసేన పార్టీ అధ్వర్యంలో మెగారక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదానం శిబిరాన్ని రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త గుండుబోగుల పెదకాపు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్ బాబు అభిమానులు సుమారు 50 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు లింగోలు పెద్దబ్బులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ కుమార్, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, ఎలక్షన్ కమిటీ కో-కన్వీనర్ గోదావరి జోన్ పినిశెట్టి బుజ్జి, మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, దొడ్డ జయరాం మరియు రాజోలు నియోజకవర్గం మండల కార్యవర్గం గ్రామ శాఖ అధ్యక్షులు ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొనడం జరిగింది.