రామసేతు అప్డేట్‌

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఇటీవల ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అయిన విషయం విదితమే. ఈ సందర్భంలో తన లేటెస్ట్ మూవీ రామసేతు గురించి కూడా ఆయనతో చర్చించాడు. ఈ సినిమాను సహజంగా చిత్రీకరించాలనుకుంటున్న చిత్ర యూనిట్‌.. అయోధ్యలోనూ షూటింగ్ జరపాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని యోగితో సమావేశం సందర్భంగా అక్షయ్ ప్రస్తావించినట్లు సమాచారం. రామసేతు అనేది నిజమా, కల్పనా అని తెలుసుకునే ఓ కథానాయకుడి కథే ఈ రామసేతు. వచ్చే ఏడాది యూపీలో షూటింగ్ జరపాలని సినిమా యూనిట్ భావిస్తోంది. డైరెక్టర్ అభిషేక్ శర్మతోపాటు అక్షయ్ కుమార్ ఈ సినిమాను అత్యంత సహజంగా చిత్రీకరించాలని అనుకుంటున్నారు.