టి.సుండుపల్లి మండల ఎస్సైను మర్యాదపూర్వకంగా కలిసిన రామశ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల ఎస్సైగా నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బి.రామక్రిష్ణ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి మండలం తరపున బీసీ లీడర్ సాంబ, యస్.టి లీడర్ కృష్ణా నాయక్ ల నేతృత్వంలో శాలువా, పూలమాలతో సత్కరించారు. అనంతరం జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ ఎస్సై రామకృష్ణా రెడ్డికి స్వాగతం పలుకుతూ మండలంలోని బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు సంబంధిత బాధితులకు న్యాయంగా మీ విలువైన సేవలను ప్రజలందరికీ అందుబాటులో మీ సర్వీస్ ఉండాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించి ప్రజలకు మేలు జరిగే విధంగా నా యొక్క అడుగులు ఉంటాయని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కరీస్ట్ పల్లం నాగేంద్ర, బీసీ లీడర్ నాగాంజనేయులు, భాస్కర్, వెంకటేష్, ప్రజాసంఘాల నాయకులు, జనసైనికులు, యువకులు పాల్గొన్నారు.