రంబాల సురేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన పితాని

గురువారం: రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజవర్గం ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో జనసేన కార్యకర్త రంబాల సురేష్ బాబు ట్రాక్టర్ తిరగబడి ప్రమాదంలో మరణించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్, రంబాల రమేష్, రంబాల చౌదరి, గుద్దట జమ్మి, గోదాశి పుండరష్, పిల్లి గోపి, దూడల స్వామి, కడలి సత్యనారాయణ, కడలి వెంకటేశ్వరరావు, కాలాడి రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.