కోవిడ్ నిబంధనల ప్రకారం రంజాన్ జరుపుకోవాలి: ఏపీ సర్కార్

కోవిడ్ నిబంధనల ప్రకారం రంజాన్ జరుపుకోవాలి. శుక్రవారం రంజాన్ పండుగను పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో కరోనా కేసుల పెరుగుతున్న దృష్ట్యా మసీదుల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ప్రస్తుతం ఏపీలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లో ఉండటం వలన నమాజ్ సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రార్ధనలు పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధ్యమైనంత మేరకు ఎవరి ఇళ్లల్లో వారే ప్రార్ధనలు చేసుకోవాలని సూచించింది.