జాతీయ జెండాను ఆవిష్కరించిన రావుల మధు

రామగుండం నియోజకవర్గం, గోదావరిఖని ప్రధాన చౌరస్తా లో 74వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు రావుల మధు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రామగుండం ప్రజలకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.. ఈరోజు యొక్క విశిష్టత కచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకొని భారత స్వాత్రంత్రఒ కోసం పోరాడిన స్వాత్రంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే కాకుండా మొదటి సారి పూర్ణ స్వరాజ్యం అని తీర్మానం చేసి జెండా ఆవిష్కరించిన రోజు అని తెలియజేసారు.. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు రావుల సాయికృష్ణ, మంథని శ్రవణ్, రామగుండం నియోజకవర్గం నాయకులు చిట్టి రాజశేఖర్, బండారి తిరుపతి, రవికాంత్, రాకేష్, శశాంక్, మృనల్, రాంచందర్, సురేష్, కుమార్, మహేందర్, అశ్రీత్, సంతోష్, పవన్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.