జాతీయ జెండాను ఆవిష్కరించిన రాటాల రామయ్య

ఒంటిమిట్ట మండల పరిధిలోని కొత్త మాధవరం గ్రామంలో జనసేన నాయకురాలు బండి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య హాజరై జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జనసేన వీరమహిళలకు చీరలు అందజేసి, స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మాట్లాడుతూ.. దేశమంతా కులమతాలకతీతంగా జరుపుకునే పెద్ద పండుగ గణతంత్ర దినోత్సవమని భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవిస్తూ, దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు బండి లక్ష్మీదేవి, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.