రెండు వందల మందికి వనభోజనాలు ఏర్పాటు చేసిన రావూరి నాగబాబు

రాజోలు నియోజకవర్గం, మంచి ఆశయంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న బి.సావరం గ్రామ జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రావూరి నాగబాబు రాజోలులో సీపీఎం కాలనిలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాన్యంగా కార్తీక మాసం అంటే మనకి గుర్తుకు వచ్చేది శివ ఆరాధనలు, వనభోజనాలు అయితే ఎవరి సామాజికవర్గానికి చెందిన వారు తమ తమ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను పిలుచుకుని అంతా కలిసి భక్తితో వనదేవతని పూజించుకుని అందరూ ఒకే దగ్గర బోజానాలు చేయడం మన సంప్రదాయం. అయితే బి.సావరం వైస్ ప్రెసిడెంట్ శ్రీ రావూరి నాగబాబు మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి సుమారు రెండు వందల మంది పేద ప్రజల కోసం వనభోజనాలు ఏర్పాటు చేయడం మంచి పరిణామమే కాకుండా గర్వించదగ్గ గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు .