బండారు శ్రీనివాస్ నాయకత్వంలో జనసేన పార్టీ అంచలంచలుగా ప్రజలందరి మన్ననలు పొందుతుంది

జనసేన పార్టీ జిల్లా రథసారథి కందుల దుర్గేష్ అధ్యక్షతన మారేడుమిల్లి వుడ్ పార్క్ రిసార్ట్ లో ఐదవ జిల్లా కార్యవర్గ సమావేశం బండారు శ్రీనివాస్ జనసేన ఇన్ఛార్జ్ కొత్తపేట నియోజకవర్గం!

ఐకమత్యమే మహాబలం! అదే జనసేనాని ఆశయం! జనసేన పార్టీని ఒక గొప్ప ఆశయంతో, ఒక లక్ష్యంతో ముందుకు తీసుకు వెళుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, జిల్లా రథసారథి కందుల దుర్గేష్ కు అండగా మేము సైతం అంటున్న నియోజకవర్గం ఇన్చార్జులు, జిల్లా కార్యదర్శులుతో మారేడిమిల్లి వుడ్ పార్క్ రిసార్ట్ యందు ఆదివారం సాయంత్రం జిల్లా నాయకులు, కార్యవర్గంతో ప్రత్యేక సమావేశం జరిగింది.

తూర్పు గోదావరి జిల్లా, జనసేన పార్టీ జిల్లా ఐదవ కార్యవర్గ సమావేశం ఆదివారం మారేడుమిల్లి వుడ్ పార్క్ లోని సమావేశపు హాలునందు తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ రథసారథి కందుల దుర్గేష్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి నియోజవర్గ ఇన్చార్జిలు, రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గం సభ్యులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ తన నియోజకవర్గంలో పలు సమస్యలు ఇసుక, మట్టి అక్రమ సమస్యలు, అక్రమ తవ్వకాలుమీద, ఇతర సమస్యల మీద స్పందించి మాట్లాడారు. ఈ సమావేశానికి కొత్తపేట నియోజకవర్గం నుండి, జిల్లా కార్యవర్గం జనరల్ సెక్రెటరీ తాళ్ల డేవిడ్, మరియు సెక్రెటరీ సంగీత సుభాష్, దొంగ సుబ్బారావు సెక్రెటరీ, బొక్క ఆదినారాయణ జాయింట్ సెక్రెటరీ పాల్గొని పలు అంశాలపై, జనసేన పార్టీ యొక్క ఉన్నతి, పటిష్టత కొరకు మాట్లాడారు. వీరంతా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నతమైన ఆశయాలకోసం, మేము సైతం ముందుకు జనసేన పార్టీ నడిపిస్తామని, అన్ని వర్గాలను, అన్ని కులాలను కలుపుకుంటూ, కుల మత బేధం లేకుండా, జనసైనికులు, కార్యకర్తలు, వీర మహిళలను, ఎంతో ఆత్మీయతతో ఐకమత్యంతో కాపాడుకుంటూ ముందుకు సాగుతామని, కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ నాయకత్వంలో జనసేన పార్టీ అంచలంచలుగా నియోజకవర్గములో ప్రజల అందరి మన్ననలు పొందుతుందని, ఎంతో బలోపేతమైన స్థాయికి చేరుకుందని, ఈ సందర్భంగా కార్యదర్శులు తెలియజేసారు.