జనసేన పార్టీలో చేరిన ప్రముఖ వ్యాపార వేత్త రావూరి సురేష్

కొప్పర్రు పంచాయతీ మాజీ వైస్ ప్రెసిడెంట్, ప్రముఖ వ్యాపార వేత్త రావూరి సురేష్ బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా రావూరి సురేష్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ పట్ల రోజు రోజుకి ప్రజలలో నమ్మకం పెరుగుతుందని, 2024 లో పవన్ కళ్యాణ్ సీఎం కావటం తధ్యం అని, నరసాపురం నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం బొమ్మిడి నాయకర్ గారితో కలిసి కృషి చేస్తామని సురేష్ తెలియచేశారు.

ఎనో సేవా కార్యక్రమాల్లో చూరుగ్గా పాల్గునే రావూరి సురేష్ గారి లాంటి నాయకులు పార్టీ పట్ల ఆకర్షితులు కావటం చాలా మంచి పరిణామం అని బొమ్మిడి నాయకర్ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పత్తి రామకృష్ణ, పోలిశెట్టి నరేష్, పిప్పళ్ల సత్య శ్రీ , అందే నరేన్, ముక్కు తాతాజీ, పోలిశెట్టి వెంకటేశ్వర రావు, దారాబత్తుల హరి సాయిరాం, కొల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు.