మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తున్న వైసీపీ మంత్రులపై రాయపూడి ఫైర్

అవనిగడ్డ: మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తున్న వారికి త్వరలోనే నడిరోడ్డుపై బడిత పూజ ఖాయమని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ అన్నారు. మోపిదేవి మండలం మెరకనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ చిరంజీవిపై అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాపర్ డ్యాంకు – డయాఫ్రంవాల్ కు తేడా తెలియని ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ కాలక్షేపం చేయటం, బ్రో సినిమా గురించి ఈడీ వద్దకు వెళతా అనటం సిగ్గుచేటన్నారు. మంత్రులంతా సకల శాఖ మంత్రికి బాధ్యతలు అప్పగించి కాలక్షేపం చేస్తుంటే, సీబీఐ దత్త పుత్రుడు మాత్రం మంత్రులను పదేపదే పవన్ కళ్యాణ్ పై ఉసి గొల్పుతున్నారన్నారు. మోపిదేవి మండల అధ్యక్షుడు పూషడపు రత్న గోపాల్, ఉపాధ్యక్షులు భోగిరెడ్డి సాంబశివరావు, అరజా కిరణ్ కాంత్, మెరకనపల్లి నరేష్, బాదర్ల లోలాక్షుడు మెరకనపల్లి గ్రామ అధ్యక్షుడు యర్రంశెట్టి సునీల్ బాబు, ఆకుల పవన్ కళ్యాణ్, చవాకుల సురేష్ జన సైనికులు పాల్గొన్నారు.