రాజోలు ప్రజలు రాపాకను తిరస్కరిస్తారని.. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పుతారు: కందుల దుర్గేష్

జనసేన ఎమ్మెల్యే రాపాకపై ఫైర్ అయిన జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్
జనసేన నాయుకులు, కార్యకర్తల పై అక్రమంగా కేసులు పెట్టిన ఎమ్మెల్యే రాపాక
జనసేన శ్రేణులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం అన్యాయం
కష్టపడి రాపాకను గెలిచిన వారిపై కేసులు పెట్టడం దారుణం
ఎన్నికేసులు పెట్టినా జనసేనపార్టీ అండగా ఉంటుంది… భయపడే పరిస్థితి లేదు

తూర్పుగోదావరి జిల్లా, మలికిపురం మండలం లక్కవరంలో సభలో జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ పాల్గొన్నారు. జిల్లా అద్యక్షుడికి కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముందుగా ఇటివల మృతిచెందిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజోలులో జనసేనపార్టీలో కష్టపడి రాపాక వరప్రసాదరావును గెలిపించిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వేధించటం అన్యాయమని అధికార పార్టీతో చేతులు కలిపి జనసేన శ్రేణులను మానసికంగా వేధిస్తున్నారని.. ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా జనసేనపార్టీ అండగా ఉంటుందని కందుల దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ కందుల దుర్గేష్, శ్రీ పితాని బాలకృష్ణ, శ్రీ DMR శేఖర్, మామిడికుదురు మండలం జనసేన పార్టీ నాయకులు, రాజోలు నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు పాల్గొన్నారు. శతఘ్ని న్యూస్ జనసేన పార్టీకి చేస్తున్న సేవలను జనసేన నాయకులు కొనియాడారు.