మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.. తొలుత గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..

ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గారు కలలు కన్న స్వరాజ్యం దేశంలో స్వాతంత్ర్యం వచ్చి 75 వ సంవత్సరాలు పూర్తైన ఇంకా బ్రిటిష్ పరిపాలన లాగా పాలిస్తున్న నాయకుల తీరు చూస్తుంటే.. నాటి గాంధీ గారు కలలు కన్న స్వరాజ్యం దేశంకోసం త్యాగం చేసిన ఎందరో మహనీయుల త్యాగ ఫలితం శూన్యం అని రెడ్డి అప్పల నాయుడు వ్యాఖ్యానించారు.. ఈరోజు రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బ్రిటిష్ వారి పాలనను తలపిస్తున్న ట్టు కనిపిస్తుంది.. పన్నుల భారంతో రాష్ట్ర ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి పరిపాలనా ఉన్నది.. అనంతరం 25 వ డివిజన్ శనివారపు పేట గాలిగోపురం సెంటర్లో ఉన్న గాంధీ గారి విగ్రహానికి రాష్ట్ర చేనేత వికాస విభాగ కార్యదర్శి దోనేపూడి లోవరాజు ,కొనికి మహేష్ గారి ఆధ్వర్యంలో పూలమాల వేసి జయంతి వేడుకలను నిర్వహించారు..ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, కార్యవర్గ సభ్యులు బోండా రాము నాయుడు, నాయకులు గుబ్బల నాగేశ్వరరావు, నిమ్మల శ్రీనివాసు, కందుకూరి ఈశ్వరరావు, చీమల గోపి, ఎ. సురేష్ మరియు 25 వ డివిజన్ జనసైనికులు పాల్గొన్నారు.