రెమిడెసివిర్ తక్కువ ధరకే మార్కెట్ లో

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరించడంతో కరోనా వైరస్ కు మందుగా ప్రాచుర్యంలో ఉన్న రెమిడెసివిర్ మందును మరో ఇండియన్ కంపెనీ ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులోనికి తేనుంది. సిప్లా, హెటిరో తరువాత ఈ డ్రగ్ ను లాంచ్ చేస్తున్న మూడో కంపెనీగా ఖ్యాతి దక్కించుకోనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవాటికంటే కాస్త తక్కువ ధరకే ఈ మందును అందించనున్నట్టు కంపెనీ ప్రకటించింది.