రోడ్లను వెంటనే బాగుచేయ్యండి, నినదించిన సాలూరు జనసేన

సాలూరు పట్టణం ముఖ ద్వారంగా ఉండే డిగ్రీకాలేజ్, కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, లారీ పార్కింగ్ యార్డ్, శ్రీనివాస కాలనీ గల సముదాయంలో నేషనల్ హైవే మధ్యలో ఉన్న హైవే రోడ్లు దారుణంగా దెబ్బతిని ఉన్నాయి. ఈ మద్య వర్షాలు అధికంగా కురుస్తుండటం వల్ల రోడ్డు మధ్యలో ఉన్న ఈ ప్రమాదకరమైన గుంతల్లో నీరు నిల్వ ఉండటం వల్ల అందులో పడి చాలామంది వాహనదారులు గాయాల పాలు అవుతున్నారు.
చాలా వాహనాలు మరమ్మత్తులకు గురవుతున్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి రోడ్లు మరమ్మతులు చేపట్టాలని సాలూరు జనసేన నాయకులు నినదించారు. అనంతరం సాలూరు మున్సిపల్ కమిషనర్ ని సంప్రదించి పట్టణ పరిధిలో పాడైన రోడ్లను అత్యవసరంగా బాగుచేయ్యాలి లేదా తాత్కాలిక మరమ్మత్తులు అయినా చెయ్యాలి అని రేగు మహేశ్వరరావు కోరడం జరిగింది. పట్టణ జనసేన నాయకులు రేగు మహేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శివ, నవీన్, శ్రీను, సంతోష్, రవి, మురళి, విద్యా సాగర్, ఈశ్వర్, పవన్, సాయి తదితరులు పాల్గొన్నారు.