ప్రజాప్రతినిధులారా మీ నిర్లక్ష్యం భావితరాల భవిష్యత్ కి పెను ముప్పు

  • నసేన పార్టీ లీగల్ అడ్వైజర్ రాజన్ కిల్లో

పాడేరు: ప్రజాప్రతినిధులకు శతకోటి వందనాలు.. మీ నిర్లక్ష్యం భావితరాల భవిష్యత్ కి పెను ముప్పు అని
జనసేన పార్టీ లీగల్ అడ్వైజర్ రాజన్ కిల్లో పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మట్లాడుతూ.. పెదబయలు మండలం ఇంజరి పంచాయతీకి చెందిన గబుడుపుట్టు గ్రామస్తులము మా గ్రామంలో వర్షాకాలంలో మా యొక్క పిల్లలు పాఠశాలకు వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతూ వెళుతున్నారు, ఇదే రహదారి మీదుగా రెండు మూడు గ్రామాల వారు రాకపోకలు కొనసాగిస్తున్నారు. మేము ఆస్పత్రికి, మార్కెట్ కి ఇంకా ఎక్కడికి వెళ్లాలన్నా ఈ రహదారిలోనే వెళ్ళాలి, మా గ్రామంలో అత్యవసర సరుకులు తీసుకురావాలంటే చాలా కష్టంగా ఉంది. కనీసం ద్విచక్ర వాహనం కూడా రాని పరిస్థితిని ఎదుర్కొంటున్నాం మా గ్రామస్తులు అనేకమార్లు అధికారులకు, నాయకులకు వినతి పత్రాలు అందించడం జరిగింది కానీ ఎవరు స్పందించట్లేదు, మా గ్రామంలో సీ.సీ ర్యాంపు, డ్రైనేజ్ కాలువలు, కలవర్స్ బ్రిడ్జి నిమిత్తము నాడు టిడిపి ఎమ్మెల్యే గారిని మేము కలవగా ఇవన్నీ చేసి పెడతానని దివంగత ఎమ్మెల్యే సర్వేశ్వరరావు మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు. అలాగే నేడు వైసీపీ ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ ఈ పరిస్తుతుల్ని చూసి వెళ్లారు. మమ్మల్ని గెలిపిస్తే గ్రామం ఎంతో అభివృద్ధి పరుస్తాను అన్నారు. ఇదివరకు ఒక్క పనికి శంకుస్థాపన కూడా చేసి పెట్టలేదు. వీళ్ళందరూ మాటలకే పరిమితం అయ్యారు చేతల్లో ఏ పనులు చూపించట్లేదు. మా యొక్క వేదనను కష్టాలను అధికారులు స్పందించే దాఖలాలు లేవు ఈ ప్రభుత్వంలో మా కష్టాలు తీరే అవకాశమే లేదోమోనని గ్రామస్తులు వాపోయారు. ఇటువంటి గిరిజన ప్రజల సమస్యలు అనేకం కానీ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇంకా కనీస మౌళిక సధుపాయలు కల్పించలేని చేతకాని ప్రభుత్వాలపై గిరిజనులు నమ్మింత కాలం అభివృద్ధిని ఆశించడం వృధా అంటూ గిరిజాప్రజాప్రతినిధులపై జనసేన పార్టీ లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ మండిపడ్డారు.