పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలభిషేకం చేసిన పేడాడ రామ్మోహన్

ఆమదాలవలస: జనసేన పార్టీ అధినేత పవన్ ఉన్న కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడిన మాటలను తప్పుగా దుష్ప్రచారం చేస్తూ వైసీపీ నాయకులు గ్రామ వాలంటీర్లను రెచ్చగొట్టి చేస్తున్న ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పూలమాల వేసి పాలభిషేకం చేసారు. ఈ సందర్భంగా నియోజకవర్గం ఇంచార్జ్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. అభివృద్ధి మీద ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా అవినీతే లక్ష్యంగా నైపుణ్యం కలిగిన లక్షలాదిమంది యువతను కేవలం 5000 రూపాయలు ఇచ్చి, వెట్టి చాకిరీ చేయిస్తు, యువతను వైసీపీ కార్యకర్తలుగా మార్చే ప్రయత్నము చేస్తున్నారు. యువతను నిరుద్యోగులుగా మార్చుతున్నారు. ఉద్యోగ క్యాలెండర్ లేదు, ఉపాధి అవకాశాలు లేవు, అభివృద్ధి లేదు. ఇలా ఏ ఒక్క సిద్ధాంతాలపై మాట్లాడ లేని వైసీపీ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగడం, యువతను ప్రక్క తోవ పట్టిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం యువతకు భేసరతుగా క్షమాపణ చెప్పాలి అని అన్నారు. అంతరం హలో ఏపీ, హలో ఏపీ బై బై వైసీపీ, వెల్కమ్జే ఎస్ పి #HelloAP_ByeByeYCP #HelloAP_Welcom_JSP నినాదాలతో హోరెత్తించారు. దానితో దౌర్జన్యంగా పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి మండల అధ్యక్షుడు పైడి మురళి మోహన్, నియోజకవర్గం నాయకులు కొంచాడా సూర్యడు, రమణ, అప్పలరాజు, రాంబాబు, కొటేష్, పణి కుమార్, చంద్ర మాలి, శ్రీదర్, హర్ష, శ్రీనివాస్, తేజ, సురేష్, సతీష్, గణేష్, రాజు, కరుణ సాగర్, యశ్వంత్, హేమ సుందర్, రామకృష్ణ, తావిటి నాయుడు, రాజుకుమర్, జనసైనికులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.