జనసేనపై రాజకీయ కక్షకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వం

  • పవన్ కళ్యాణ్ కి ఏమైనా హాని జరిగితే జనసైనికులను రాష్ట్రంలో ఎవరూ ఆపలేరు
  • జనసేన మండల కన్వీనర్ పోతుల సాయినాథ్

తంబళ్లపల్లి నియోజకవర్గం, ములకలచెరువు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కి ఏదైనా హాని జరిగితే రాష్ట్రంలో జనసైనికులను ఎవరూ ఆపలేరని జనసేన మండల కన్వీనర్ పోతుల సాయినాథ్ హెచ్చరించారు. గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో జనసేన మండల కన్వీనర్ పోతుల సాయినాథ్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడిన పట్టించుకోని పోలీసులు గంగాధర నెల్లూరు జనసేన డాక్టర్ పొన్నా యుగంధర్, నారాయణ స్వామి మాటలకు స్పందించినందుకు అతని మీద కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. గత 11 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం కోసం ప్రయత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ కి ఏమైనా హాని జరిగితే రెండు రాష్ట్రాల్లో జనసైనికుల ఉగ్రరూపం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి పవన్ కళ్యాణ్ కి భద్రత పెంచాలని పవన్ కళ్యాణ్ కి ఎటువంటి హాని జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మద్దతు తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. రాజకీయ కక్షలకు పాల్పడుతున్న ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అలాగే రాష్ట్రంలో ఎక్కడ జనసైనికులకు అన్యాయం జరిగిన ఇక ఓపికతో సహించేది లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షోరూం సూరి, సుదర్శన్, రాంబాబు, మహేష్, బావాజీ, గణేష్, నరేందర్ రెడ్డి, ప్రభాకర్, శంకర్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.