ఎర్రవరం గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రవరం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని స్మరించుకోవడం జరిగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశానికి ప్రతీకగా ఉండే జెండాని గౌరవించడమే మాత్రమే కాకుండా దేశానికి దిశా నిర్దేశం చేసిన లిఖిత పూర్వకమైనటువంటి రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని కూడా గౌరవించుకోవాలి చాలా ప్లేస్ లో ఈ తప్పిదం జరిగింది కాబట్టి జనసేన పార్టీ తరఫున ఈ విధంగా గ్రామంలో స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ గంగిరెడ్ల మణికంఠ, జనసేన పార్టీ గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు గోస నుకరాజు, గ్రామ కమిటీ సెక్రెటరీ లక్కే వెంకట్రావు, గ్రామ ప్రచార కార్యదర్శి అడ్డాల శివ, గ్రామ కమిటీ కోశాధికారి పెనిపోతుల సత్తిరెడ్డి హాజరయ్యారు.