మలికిపురం మండలంలో రిపబ్లిక్ దినోత్సవం వేడుకలు

రాజోలు, గణతంత్ర దినోత్సవంలో భాగంగా మలికిపురం మండలం జనసేన ఎంపిపి శ్రీమతి మేడిచర్ల సత్య వాణి రాము మలికిపురం మండల ఆఫీసులో జెండా వందనం చేయటం జరిగింది. రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా గూడపల్లి గ్రామంలో బెస్ట్ వాలంటీర్ గా ఎన్నికైన కానూరి శివ నారాయణను గూడపల్లి జనసేన వైసి ఎంపీపీ సుందర శ్రీను ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుందర తాతాజీ, సుందర పండు, బుల్లబ్బాయి, సుందర బ్రహ్మయ్య, సుందర కొండబాబు, గ్రామ పెద్దలు, వాలంటీర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.