మైలవరం జనసేన ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

మైలవరం: స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాన్ని జాతీయ జెండా తోరణాలతో అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మైలవరం మండల ప్రధాన కార్యదర్శి చంద్రాల మురళీకృష్ణ, భూక్య చిరంజీవి, కార్యదర్శి ఉయ్యూరు నాగరాజు, సంయుక్త కార్యదర్శులు ఆనం విజయ్ కుమార్, మాదాసు సుబ్బారావు మరియు జనసైనికులు మర్రి కొండలరావు, బి. ఓంకార్ గోపి, రవితేజ, శీలం కొండలరావు, తమ్ముండ్రు నవీన్, జనసేన సీనియర్ వీరమహిళ కన్నాంబ తదితరులు పాల్గొన్నారు.