జనసేనలో చేరిన అమలాపురం మాజీ మున్సిపల్ ఛైర్మన్

అమలాపురం నియోజకవర్గం, జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ మరియు జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన అమలాపురం మాజీ మున్సిపల్ ఛైర్మన్ యాళ్ళ నాగ సతీష్ మరియు వారి అనుచరులు. అమలాపురం ఎర్రవంతెన దిగువ నుంచి కార్లు, బైక్లపై ర్యాలీగా అధిక సంఖ్యలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ యళ్ల నాగ సతీష్ కి శుభాకాంక్షలు తెలిపిన మునిపల్లి జనసేన శ్రేణులు యర్రంశెట్టి సుభాష్, నిమ్మకాయల సాయి, నిమ్మకాయల బాపూజీ, నూకల రాజా కల్వకొలను శివ, నిమ్మకాయల మధు, యర్రంశెట్టి, మల్లి బాబు.