తిరుపతి జనసేన ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

తిరుపతి, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఐస్ మహల్ వద్ద గల 29, 30 వార్డులలో యువత కోమల్ బాబు, ప్రవీణ్ కుమార్, నారాయణ, సురేంద్ర మోహన్, శరత్, వరుణ్ లు ఎంతో ఉత్సాహంగా జెండా వందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేష్ యాదవ్ విచ్చేశారు. జిల్లా నాయకులు హేమ కుమార్, కీర్తన, సుమన్ బాబు, అమృత, సాయి దేవ్, కిషోర్, చరణ్, కార్తీక్ సతీష్, సోము, విజయ్ తదితరులు పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసి వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మహానుభావులు అందరినీ గుర్తు చేస్తూ గణతంత్ర దినోత్సవం యొక్క విశిష్టతను తెలియజేశారు.