అత్తిలి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

అత్తిలి 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అత్తిలి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జాతీయ నాయకులకు వందనం చేసి జాతీయపతాకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి అన్నెం విశ్వప్రభు, ఎంపీటీసీ శ్రీమతి కూసంపూడి గీతారత్నం, వార్డు సభ్యులు సుంకర సుబ్రమణ్యం మరియు అత్తిలి మండల జనసైనికులు, వీరమహిళలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.