బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

భైంసా కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో పురుగుల అన్నం తినడం వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అదే విధంగా పాఠశాలలో చేర్చుకోవడానికి పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై విచారణ జరిపి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని, ఈ సమస్య పై ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్డాలని కోరుతున్నామని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు తెలిపారు.