సమాజానికి మీరే గౌరవం – కావాలి మాకు మీ అనుభవం

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో కాకినాడ సిటిలోని సీనియర్ సిటిజన్స్ ని గౌరవించుకుని వారి అనుభవ పాఠాలతో సూచనలు కోరుతూ సమాజానికి మీరే గౌరవం కావాలి మాకు మీ అనుభవం కార్యక్రమం చిరంజీవి ఆధ్వర్యంలో శారదానగర్ ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ శ్రేణులు సీనియర్ సిటిజన్ మధుసూదనరావు గారిని వారి ఇంటికి వెళ్ళి కలుసుకుని వారియొక్క క్ష్యేమ సమాచారం తెలుసుకున్నారు. ఇదివరకు పిల్లలను పెద్దవారి నీడలో ఉంచి కౌమారదశ వరకు వారి సమ్రక్షణలో పెరిగేలా జాగ్రత్తలు తీసుకునేవారనీ అందుకు కారణం ఏది మంచి ఏది చెడు అన్నది పెద్దవారి అనుభవసారంతో పిల్లలు నేర్చుకుంటూ వారి మనోవికాశం జరిగి ఉత్తమ పౌరులుగా తయారవ్వాలన్న సత్సంకల్పమన్నారు. దీని అర్ధం చరిత్రని గమనిస్తే సీనియర్ సిటిజన్స్ యొక్క అనుభవం మరియు ముందుచూపుగా చెప్పుకోవాలన్నారు. అలాంటి సీనియర్ సిటిజన్స్ మార్గదర్శకత్వం సమాజానికి ఎంతో అవసరం అని తెలియచేస్తూ రాబోయే జనసెన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంలో పేదలకు కల్పించవలసిన సదుపాయాలు, వసతులని వారి అనుభవంతో సూచిస్తూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి లేఖను రాయవలసినదిగా కోరుతు పోస్టల్ కవర్లను అందచేసారు. ఈ కార్యక్రమంలో రావిపాటి వెంకటేశ్వరరావు, తుమ్మలపల్లి సీతారాం, గరగా శ్రీనివాసరావు, ముమ్మిడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.