జగన్నాధపురంలో స్కాముపై చైతన్య యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో స్కాముపై చైతన్యం కార్యక్రమం స్థానిక జగన్నాధపురంలోని జె. రామారావు పేట సెంటర్ వద్ద జిల్లా సమ్యుక్త కార్యదర్శి బడే క్రిష్ణ ఆధ్వర్యంలోను, భానుగుడిలోని రిజర్వ్ లైన్ అయ్యప్ప స్వామి గుడి సెంటర్లో తోట కుమార్ ఆధ్వర్యంలోను జరిగింది. ఈ సంధర్భంగా జనసేన శ్రేణులు మాట్లాడుతూ జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ బట్టబయలు చేస్తున్న ప్రభుత్వ అవినీతిలను తాము నాదెండ్లగారు మాట కాకినాడలో అందరినోట అనే నినాదంతో ప్రతిరోజూ చైతన్య యాత్రని చేస్తున్నామన్నారు. తమ నాయకులు మనోహర్ వెలుగులోకి తెచ్చిన గేదెల స్కాం, పిల్లల స్కూలు బ్యాగులు, షూల స్కాం, జగనన ఇళ్ళ పధకం స్కాము అవినీతిపై ఈ వై.సి.పి నాయకులు నొరువిప్పడంలేదనీ, విషయం పెద్దది కాకుండా దాటవేస్తున్నారనీ కానీ దీనిని తాము వదిలిపెట్టమన్నరు. ఈ వై.సి.పి ప్రభుత్వ అవినీతిని మొత్తం వెలికితీస్తామనీ, తిన్నదంతా కక్కిస్తామన్నారు. వై.సి.పి చేసే అసత్యప్రచారాన్ని జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా తిప్పికొడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండపాక దుర్గాప్రసాద్, శివాజి యాదవ్, పెమ్మాడి సాంబశివ, వరిపల్లి ప్రసాద్, గోగు సతీష్, గరగ శ్రీనివాసరావు, ముల్లోటి లోక భగవాన్, అగ్రహారపు సతీష్, మోర్త మాలతి, గుర్రాల త్రిమూర్తులు, రామిరెడ్డి నగేష్, దేవ్ మహేష్, గంటిమి దుర్గా ప్రసాద్, తోరం చిరంజీవి, దేవు మహేష్, తోట కృష్ణ తేజ, తుమ్మలపల్లి సీతారామ, శెట్టి జోగిరాజు, వాడకొట్టు శ్రీనివాసరావు, అడపా కుమార్, తాతపూడి చిన్మయ శర్మ, మాచర్ల మణి, దాసరి దుర్గాప్రసాద్ దారపు శిరీష, చొడిపల్లి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.