జనం కోసం జనసేన మహాయజ్ఞం 721వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 721వ రోజు కార్యక్రమం బుధవారం జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 722వ రోజు కార్యక్రమం గురువారం జగ్గంపేట మండలం రామవరం మరియు ఇర్రిపాక గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జన సైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గొన శివరామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటి అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు(శ్రీను), జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి ముమ్మన వేణుగోపాల్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి అడపా రాంబాబు, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, రామవరం నుండి బుర్రి రాజా, సింగం శివ సాయి, గౌరోజు చక్రధర్, కత్తి లోవయ్య, గారపాటి స్వామి, సూరంపాలెం నుండి జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థి గుత్తుల గంగాధర్, మర్రిపాక నుండి పాటంశెట్టి శ్రీనివాస్, సోమవరం నుండి డేగల నరేష్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ కృతజ్ఞతలు తెలిపారు.