సెంటిమెంట్ తో గద్దర్‌ను కలిసిన రేవంత్..

గ్రేటర్ ఎన్నికల వేళ  ఎంపీ రేవంత్ రెడ్డి  ప్రజా గాయకుడు గద్దర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు మొదట గద్దర్‌ని కలిశానని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలలో మేయర్‌ను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని లేదంటే.. ప్రతిపక్షంగా పాతిక ముప్పై సీట్లు ఇవ్వాలని గ్రేటర్ ప్రజల్ని కోరారు. ప్రతిపక్షం స్ట్రాంగ్‌గా ఉంటే సమస్యలపైన పోరాడి.. పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. తాను ఎంపీగా ఉన్నానని.. తనకు తోడుగా 20-30 మంది కార్పొరేటర్లనిస్తే సమస్యల పైన ప్రభుత్వాన్ని నిలదీస్తామని రేవంత్ తెలిపారు.