ఎస్.కోట జనసేన ఆత్మీయ సమావేశం

ఎస్.కోట, జనసేన అధ్వర్యంలో ఆదివారం ఎస్.కోట అర్.కే.కళ్యాణమండపంలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశము నుద్దేశించి ఎస్.కోట నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే టిడిపి-జనసేన-బీజేపీ కూటమి ఏర్పాటు చేయడములో పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోసించారనీ వారి కృషిని అభినందించారు. ఎస్.కోట నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో జనసేన పార్లమెంట్ అభ్యర్థికి గాజు గ్లాసుకి 16680 ఓట్లు పడ్డాయని ఇది విజయనగరము జిల్లాలో అన్ని నియోజకవర్గాల జనసేన ఓట్లకన్నా ఎక్కువ బలమున్న నియోజకవర్గంగా నిరుపితమయిందన్నరు. ప్రస్తుతం జనసేన బలం 35000 పెరిగిందన్నారు. కావున ఎస్.కోట నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ జనసేనకు కేటాయించాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నామన్నారు. కూటమిలో ఏ పార్టీకి టికెట్ కేటాయించినా కూటమి అభ్యర్ధి గెలుపు కోసం జనసైనికులందరము సమిష్టిగా కష్టపడి పనిచేస్తామని తీర్మానించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల జనసేన నాయకులు కొత్యడ రామకోటి, సుంకర అప్పారావు, గొరపల్లి రవికుమార్, జామీ వర్మ రాజు, రమెళ్ల శివాజీ, అలమండ రాంబాబు, జొన్నపల్లి సత్తిబాబు డేగల ఈశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.