నాగబాబుతో సాకే మురళీకృష్ణ మర్యాదపూర్వక భేటీ

సింగనమల: అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన కొణిదెల నాగబాబు ను సింగనమల నియోజకవర్గం నాయకులు సాకే మురళీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో సింగనమల నియోజకవర్గం ప్రజల సమస్యలపై మరియు ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ సమస్యలపై రిటైర్డ్ మైనార్టీ ఉద్యోగులు, ఎస్సీ సంఘాల లీడర్లతో కలిసి సింగనమల నియోజకవర్గం సెంట్ మెంట్ గురించి వివరిస్తూ జనసేన పార్టీ అభ్యర్థి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిస్తే ముఖ్యమంత్రిగా మన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని చూస్తాము అని అలాగే అధికారంలోకి రావాలంటే ఏ పార్టీతో పొత్తు వున్న జనసేన పార్టీకి టికెట్ ఇవ్వాలని కొణిదెల నాగబాబుకు సాకే మురళీకృష్ణ వివరించారు.