బిక్కవోలు కాలవ బల్లగట్టును సందర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ మండలం, రేపూరు గ్రామం నుండి చీడిగా, ఇంద్రపాలెం, కొవ్వూరు మొదలగు గ్రామాల రైతులకు, వ్యవసాయ కూలీల రాకపోకలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే రేపూరు (ఐ ల్యాండ్ )బిక్కవోలు డ్రైన్ గా పిలవబడే కాలవ బల్లగట్టు 2019 లో పాడై పోయి ఉంది.. దీనివల్ల రైతులు, వ్యవసాయ కూలీలు, తదితరులు చాలా ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఎన్నో సార్లు స్థానిక ఎమ్మెల్యే కి విన్నవించినా ఎటువంటి ఉపయోగం లేదు, పట్టించుకోలేదు… ఇదే విషయాన్ని రేపూరు గ్రామంలో పర్యటించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీకి స్థానిక జనసేన నాయకులు తెలియచేసారు.. వెంటనే ఆ ప్రదేశాన్ని సందర్శించి తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో పని అయ్యేలా నా వంతు సహకారం చేస్తానని తెలిపారు..