సమ సమాజ స్ధాపనకై పూరించిన సమర శంఖం జనసేన పార్టీ

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్)నందు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు ఆద్వర్యంలో పెద్దసంఖ్యలో జనసేన నాయకులు, జనసైనికుల సమక్షంలో జెండా ఆవిష్కరించి స్వీట్లు పంచడం జరిగింది. ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాస రాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా వెళ్తూ జనసైనికులకు, జనసేన నాయకులకు, వీరమహిళలకు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సర్వ జనహితం, సదా ప్రజా పక్షం, సమ సమాజ స్థాపనకై, పూరించిన సమర శంఖం ఇదీ జనసేన పార్టీ ప్రస్థానం అని తెలుపుతూ నవశకానికి మనదైన ముద్ర వేస్తూ, సుపరిపాలనే ధ్యేయంగా రాజంపేట నియోజకవర్గ అభివృద్ధి కొరకు, ప్రజాశ్రేయస్సు కోసం జరగబోయే రేపటి ఎన్నికల తుదిపోరులో గెలుపు బాటకై రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, నాసర్ ఖాన్, భీమినేని రమేష్, పత్తి నారాయణ, కటారు బాబు, రాజేష్ వర్మ, ఆకుల చలపతి, నారదాసు రామచంద్ర, కుళాయప్ప, మౌల, కోళాటం హరికృష్ణ, బండ్ల నాగరాజ, నంద్యాల హరి, ఏనుగుల మల్లి, గాజుల మల్లికార్జున, ముత్యాల చలపతి, పూల మురళి, నామాల శంకర, కోళాటం నరసింహ, భారతాల ప్రశాంత్, తిప్పాయపల్లె ప్రశాంత్, వెంకటసుబ్బయ్య, మల్లికార్జున, సుధాకర్, శ్రీకాంత్, మహేష్, నాని, గణి, వంశీ, చంద్రశేఖర్, బాలాజి, శ్రీను, సాయి రాజు, మురళి, విష్ణు, కార్తిక్, పెంచలయ్య, హరిబాబు, క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.