ఇసుక రీచ్​లపై నిఘా పెట్టాలి: సిద్ధవటం జనసేన వినతి పత్రం

సిద్ధవటం: వై.ఎస్.ఆర్ జిల్లా, రాజంపేట నియోజకవర్గం, సిద్ధవటం మండలం ఎస్సై నాగ తులసి ప్రసాదు కి, ఎం.ఆర్.ఓ శంకర రావు కి శుక్రవారం జనసేన పార్టీ నాయకులు సిద్ధవటం మండలం నందు జరుగుతున్న ఇసుక రీచ్ లపై వినతి పత్రం సమర్పించారు. జంగాలపల్లె ఇసుక రవాణా హద్దులు మీరి సిద్ధవటం గ్రామపంచాయతీలో ఇసుక ఎత్తడం జరుగుతుందని, అంతేకాకుండా స్మశానం స్థలం దగ్గర మనిషి చనిపోయిన బాడీలు ఎముకలు అన్ని బయటకు వస్తున్నాయి అని.. హద్దులు మీరి ఎత్తడం రవాణా జరుగుతుందని అంతే కాకుండా అతివేగంగా వాహనాలు వెళ్లడం వలన మండలం పరిధిలోని ప్రజలందరూ భయబ్రాంతులకు గురవుతున్నామని ప్రధాన రహదారి యందు స్పీడ్ బ్రేకర్లు వెయ్యాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు రాజేష్, సిద్ధవటం గ్రామ పంచాయతీ 12వ వార్డు సభ్యులు ఆవుల రాజా, సిద్ధవటం మండలం జనసేన నాయకులు అల్లం శివ, గురు ప్రసాద్, సిద్ధవటం గ్రామ పంచాయతీ 11వ వార్డు సభ్యులు పసుపులేటి కళ్యాణ్ పాల్గొన్నారు.