పారిశుధ్య చర్యలు చేపట్టండి.. జనసేన వినతి పత్రం

పిఠాపురం పురపాలక సంగం మున్సిపల్ కమిషనర్ ప్రజా ప్రయోజనార్థం పిఠాపురం జనసేన పార్టీ జనసైనికుల నేతృత్వంలో పట్టణ జనసేన నాయకుడు చెల్లుబోయిన సతీష్ నాయకత్వంలో జనసేన అధికార ప్రతినిధి శ్రీమతి తోలేటి శిరీష, నియోజకవర్గ నాయకులు ఊట ఆదివిష్ణు, పిల్లా శివశంకర్ ఆధ్వర్యంలో బుర్ర సూర్యప్రకాశరావు, వేల్పుల చక్రధర్, బాలిపల్లి అనిల్ సమక్షంలో పిఠాపురం పట్టణంలో అనేక వార్డులో పడకేసిన పారిశుధ్య సమస్యలను నిరసిస్తూ ఎమ్మెల్యే చేతుల మీదుగా డెంగ్యూ వ్యాధి నివారణ కోసం మాస ఉత్సవాలు శ్రీకారం చుట్టిన ఈ నెలలో కూడా సంపూర్ణ పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడాన్ని ఖండిస్తూ వైరల్ ఫీవర్లు విజృంభించే ఈ సీజన్లో పట్టణంలో పలు వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు అస్తవ్యస్తంగా ఉండి అనేక బహిరంగ ప్రదేశాలు చెత్తతో నిండిపోయి పందుల స్పైరవిహారాలతో సరికొత్త వ్యాధులకు నెలవగా తయారావడాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి. చెత్త పేరుకుపోవడంతో పట్టణ ప్రజలు దుర్గందాన్ని భరించలేక అస్వస్థకు లోనవుతూ తీవ్ర అసహనాన్ని తెలియజేస్తున్న విధానాన్ని మున్సిపల్ కమిషనర్ కి తెలియపరిచి ఇకనైనా దిగువ పారిశుద్ధ్య యంత్రాంగాన్ని సమాయత్తపరచి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పట్టణ జనసేన పార్టీ కార్యకర్తలు వినతి పత్రం అందించడం జరిగినది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ జనసైనికులు
సీకొలు రాజశేఖర్, మైనాబత్తుల చిన్నా, ఆళ్లపు అచ్చారావు, డాకే బుజ్జి, బడుగు నాని, పేర్నీడి చక్రి, పసుపులేటి గణేష్, సొడిశెట్టి రాజ, కురాకుల గణేష్, గంజి గోవిందరాజు మొదలగువారు హాజరయ్యారు.